Bhu Bharati Act

 Land Registration Under Bhu Bharati Act

భూమి యజమానులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలో మార్పులు..

Land Registration Under Bhu Bharati Act

తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూ భారతి చట్టం ప్రకారం.. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి. సర్వే మ్యాప్ రూపకల్పనలో సర్వేయర్ల పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం నాలుగు మండలాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సర్టిఫైడ్ సర్వేయర్ ద్వారానే సర్వే చేయించాలి. ప్రైవేట్ సర్వేయర్లకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించిన భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ చట్టం అమలులోకి రావడంతో భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ వంటి అన్ని వ్యవహారాలు ఇకపై భూ భారతి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియల్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులను తీసుకువచ్చింది.

భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు.. 

భూ భారతి చట్టంలో పేర్కొన్న గైడ్‌లైన్స్ ప్రకారం.. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇకపై సర్వే మ్యాప్ తప్పనిసరి కానుంది. భూమి సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. దీనితో సర్వేయర్ల పాత్ర మరింత కీలకం కానుంది. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్ జరిగే ముందు తప్పనిసరిగా భూమిని సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో సర్వేయర్లు అవసరం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం సర్వేయర్ల ఎంపికపై దృష్టి సారించింది.

ఈ సర్వే మ్యాప్‌లో విక్రయించే భూమి లేదా మ్యూటేషన్ చేసే భూమి హద్దులు, విస్తీర్ణంతో సహా ప్రతి అంశాన్ని స్పష్టంగా పొందుపరుస్తారు. సర్వే మ్యాప్‌ను రిజిస్ట్రేషన్ దస్తావేజుకు జత చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సర్వే ప్రక్రియను ప్రభుత్వం ధృవీకరించబడిన సర్వేయర్ ద్వారానే చేయించుకోవాల్సి ఉంటుంది. భూ భారతి పోర్టల్ అందించే సేవల గురించి మరింత తెలుసుకోవడానికి https://bhubharati.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోర్టల్‌లో భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం ద్వారా.. చాలా కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సుమారు 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు కూడా మోక్షం లభించనుంది. సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా.. కేవలం తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులు మార్చుకున్న వారు (2014 జూన్ 2 నాటికి), తమ పేరు మీద ఆ భూమిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించడానికి అవకాశం లభిస్తుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.