Warangal Mamnoor Airpor

 Lands Near Warangal Mamnoor Airport Rs 2 Crore Per Acre

అక్కడ ఎకరానికి రూ.2 కోట్లు, అలా అయితేనే ఓకే అంటున్న రైతులు.. తెలంగాణ సర్కార్‌కు కొత్త తలనొప్పి..!

Warangal Mamnoor Airpor

వరంగల్‌ మూమునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు హఠాత్తుగా పెరిగాయి. ప్రభుత్వం ఎకరాకు రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది.

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండగా.. కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సిద్ధమయ్యారు. వరంగల్‌ జిల్లా మూమునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్ట పడటం లేదు. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు మాత్రం ఎకరానికి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు రైతులు రూ. 2 కోట్లు ఇచ్చినా తమ భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు.

కాగా, నిజాం కాలంలోనే మూమునూరు ఎయిర్‌పోర్టు నిర్మించారు. దాన్నే ప్రస్తుతం విస్తరిస్తున్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం అవసరమైన అదనపు 253 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిధిలో 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అదనపు భూమి సేకరిస్తేనే ప్రాజెక్టును వేగవంతం చేయడానికి వీలు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయ అభివృద్ధికి కొన్ని రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి లేఖ సైతం జారీ చేసింది.

వరంగల్ నగరం టెక్స్‌టైల్, ఫార్మా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, లక్నవరం, రామప్ప ఆలయం, సమ్మక్క- సారలమ్మ జాతర వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రులను కలిసి, భూమి కేటాయింపు కోసం ప్రయత్నాలు చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్తోంది. అయితే భూసేకరణ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోగా.. ఎకరం రూ. 2 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అంటున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.