profitable crops

Those crops are more profitable than rice..!

అన్నదాతలూ ఈ విషయం తెలుసా..? వరి కంటే ఆ పంటలే ఎక్కవ లాభదాయమట..!

Those crops are more profitable than rice..!

వరి పంట సాగు చేయటం కంటే చిరు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయటం ద్వారా ఎక్కువ లాభాలొస్తాయని జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్ నివేదికలో వెల్లడైంది. వరి సాగుపై కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని.. రైతులు ఇతర పంటలపై సాగు చేయాలన్నారు. వరిత పోలిస్తే చిరు ధాన్యాలు వల్ల ఎక్కవ లాభాలు ఉంటాయని చెప్పారు.

ముఖ్యంశాలు:

  • వరి కంటే చిరు ధాన్యాలే ఎక్కువ లాభసాటి
  • జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్ నివేదికలో వెల్లడి
  • ఇతర పంటలపై దృష్టి పెట్టాలంటున్న పరిశోధకులు

వరి సాగు కంటే ఇదే లాభదాయకం

తెలంగాణలో వరి ఎక్కవగా పండిస్తారన్న విషయం తెలిసిందే. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇతర పంటల కంటే వరి సాగు వైపే ఎక్కువ మెుగ్గు చూపుతారు. సంవత్సరానికి రెండు పంటల వస్తుండటంతో రైతులు వరిసాగుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయటం ఎక్కువ లాభదాయకమట. ఈ విషయం జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి సాగుపై ప్రభావం పడుతోందన్నారు.

ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందని ఆ నివేదికలో వెల్లడించారు. అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని పరిశోధకులు సూచించారు. వరి నుంచి ఇతర పంటలకు మారిన రైతులు 11 శాతం లాభాలు గడించినట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనం వెల్లడైందని చెప్పారు. వరి, జొన్న, మెుక్కజొన్న, చిరుధాన్యాలలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు తెలిపారు. కాబట్టి రైతులు వరి సాగుతో పాటుగా.. లాభదాయకంగా ఉండే ఇండే ఇతర పంటల వైపు కూడా మెుగ్గు చూపాలని సూచించారు.

పసుపు మద్దతు ధర కల్పించాలని ధర్నా.. 

పసుపుకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంగళవారం పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ నుంచి పాదయాత్రగా వెళ్లిన రైతులు.. బస్టాండ్‌ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. క్వింటా పసుపునకు రూ.15 వేల మద్దతు ధరను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. మద్దతు ధర కల్పించకుంటే తమ ఆందోళన ఉద్ధృతం రైతులు హెచ్చరించారు. పసుపు రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు పలికారు. మాయ చెప్పిన మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావటం లేదని ఫైరయ్యారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పంటను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.