PM Kisan FPO Scheme :good news for farmers, Rs. 15 lakh assistance under this scheme
PM Kisan FPO Scheme : రైతులకు కేంద్రం గుడ్న్యూస్, ఈ పథకం కింద ఏకంగా రూ.15 లక్షల సాయం-ఎలా అప్లై చేసుకోవాలంటే?
PM Kisan FPO Scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాల రైతులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రైతులకు ఏకంగా రూ.15 లక్షలు సాయం చేయనుంది.
దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోన్నారు. పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వాతావరణ పరిస్థితులు, పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులకు పెట్టుబడి కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపసమనం కల్పించాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతోన్నారు. మరోవైపు రైతులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్)ను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా రూ.6 వేలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది.
ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (పీఎంకేఎఫ్పీఓ) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులను వ్యాపారపరంగా బలోపేతం చేయడానికి, వారిని స్వావలంబన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 11 మంది రైతులు సమూహంగా ఏర్పడాలి. అంటే రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్పీఓ)గా ఏర్పడి, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం రూ.15 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే, ఈ సంస్థలో కనీసం 11 మంది రైతులు ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు. లేకపోతే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోలేరు.
ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
రైతులు ఎఫ్పీఓ ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే, రైతు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఈ పథకం అధికారిక వెబ్సైట్ https://enam.gov.in/web/ లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత లాగిన్ అవ్వాలి. ఆ క్రమంలో మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
లేకపోతే పీఎఫ్ఓ, ఎఫ్పీసీల మొబైల్ యాప్ ద్వారా ఇ-నామ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. లేదంటే, సమీపంలోని ఇ-నామ్ మండిలో ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం, మీరు ఎఫ్పీఓ ఎండీ, లేదా సీఈవో లేకుంటే, మేనేజర్ పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ అందులో పేర్కొనాలి. అప్పుడు మనకు వచ్చే మొత్తం నగదును ఎఫ్పీఓ, ఎఫ్పీసీ ఒక బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది. రైతులకు మొత్తం చెల్లింపు పోస్ట్ క్రెడిట్ ద్వారా చెల్లిస్తుంది.