Johnny Master Remand Report

Johnny Master Remand Report.

Johnny Master Remand Report.

రిమాండ్‌ రిపోర్టులో సంచలనం.. నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్!

జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయం అయ్యింది. 2020లో జానీ మాస్టర్‌ బాధితురాలిపై లైంగిక దాడి చేశారు.

పలుమార్లు లైంగిక దాడి..

తొలిసారి జానీ మాస్టర్‌ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి జరిగింది. ఈ విషయం బయటికి వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. జానీ మాస్టర్‌ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఉంది.

14 రోజుల రిమాండ్ రిపోర్ట్..

కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించగా.. ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు గోల్కొండ ఆస్పత్రిలో జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పరిపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో.. కోర్టు రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

జానీ మాస్టర్ వార్నింగ్..

పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. 'నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై తప్పుడు కేసు పెట్టించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకుంటా. నన్ను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టను' అని జానీ మాస్టర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

జానీ మాస్టర్ భార్య స్పందన..

లైంగిక వేధింపుల వ్యవహారంపై జానీ మాస్టర్ భార్య కూడా స్పందించారు. నిజంగా లైంగిక వేధింపులు జరిగితే.. తాను జానీ మాస్టర్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఏలా చెప్పిందని ప్రశ్నించారు. తన భర్తను కాలాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని వ్యాఖ్యానించారు.

గోవాలో అరెస్టు..

జానీ మాస్టర్‌ అరెస్ట్‌పై గురువారం రాత్రి పోలీసులు ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్‌ చేశామని.. గోవా కోర్టులో హాజరుపర్చి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించామని చెప్పారు. జానీపై పోక్సోతో పాటు రేప్‌ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇలా పరిచయం..

జానీ మాస్టర్ రియాలిటీ డాన్స్ షో ఢీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. 2009లో నితిన్, ప్రియమణి జంటగా నటించిన ‘ద్రోణ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ 2012లో రచ్చ సినిమాలో రామ్ చరణ్‌కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో చేస్తూనే 2014లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన జై హో చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత తమిళ్ సినిమాలకి జానీ మాస్టర్ పనిచేశారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.