AP Inter Results

 AP Inter Result 2025 through WhatsApp this time

AP Inter Results : నో టెన్షన్‌.. ఈసారి వాట్సాప్‌ ద్వారానే ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2025.. మార్క్స్‌ మెమో కూడా!

AP Inter Results

AP Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఇంటర్ ఫలితాలు వెల్లడించే సమయం సమీపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరగగా ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా అంటే ఏప్రిల్‌ నెలలోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనుంది. కాబట్టి విద్యార్థులు వాట్సాప్‌ (9552300009) ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌ 2025

ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయి అప్పుడే 15 రోజులవుతోంది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగితే.. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకూ జరిగాయి. ఏప్రిల్‌ 10 -12 తేదీల వరకు మూల్యాంకనం జరగవొచ్చు. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ ఉంటుంది. ఏప్రిల్ 15-20 మధ్యలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఎప్పటిలానే https://bieap.apcfss.in/ లేదా https://bie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

అలాగే.. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్ సేవలతో కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు Hi అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత సెలెక్ట్ సర్వీస్ కన్పిస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు మీ మార్కుల మెమో పీడీఎఫ్ కాపీ వాట్సాప్‌కు వస్తుంది.

ఏప్రిల్‌ 7 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు?

గతంలో పబ్లిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించింది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. ఈ 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌ పూర్తిచేసి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యలో సాధ్యాసాధ్యాలు, అమలు చేయాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే.. ఈసారి ఏప్రిల్‌ 7 నుంచి ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.