AYODHYA RAM DARSHAN: Free darshan of Ayodhya Ram from today.. Timings are these..
Ayodhya Ram Darshan: ఈరోజు నుంచి అందరికి అయోధ్య రాముని ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..
Ayodhya Ram Darshan: జనవరి 23 మంగళవారం నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముని దర్శనం కల్పిస్తోంది అయోధ్య ఆలయ ట్రస్ట్. దర్శనం వేళలు, ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో పాస్ పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
భారతీయుల దశాబ్ధాల కల నెరవేరింది. అయోధ్యలో శ్రీరామ మందిరం చూడాలనే కోట్లాధి మంది భక్తులకు ఆ భాగ్యం ఇప్పుడు కలుగుతోంది. జనవరి 22న ప్రాణ ప్రతిష్టతో మొదలైన అయోధ్య టెంపుల్ దర్శనం 23వ తేది మంగళవారం నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముని దర్శనం కల్పిస్తోంది అయోధ్య ఆలయ ట్రస్ట్.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేలాది మంది యోగులు, రుషుల, వేదపండితుల సమక్షంలో ప్రాణ ప్రతిష్ట వేడుక వైభవోపేతంగా ముగిసింది. సోమవారం దివ్య ముహుర్తంలో ఆ భవ్య రాముడి జన్మస్థలంలో వేద మంత్రోచ్చారణ, జైశ్రీరామ్ నినాదాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
ఎందరో వీఐపీలు, అతిధులు హాజరైన ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక తర్వాత నుంచి సామాన్య భక్తులకు అయోధ్య రాముడి దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30గంటల నుంచి దర్శనాలు చేసుకోవచ్చని అయోధ్య అలయ ట్రస్ట్ తెలిపింది. ఇక అయోధ్య వెళ్లే భక్తులు దర్శనం పాస్ లు ఎలా పొందాలనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.
అయోధ్య రాముని దర్శన వేళలు, హారతి సమయాలతో పాటు భక్తులు పాస్ లు ఎలా పొందాలనే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆలయ ట్రస్ట్. భక్తులు ఉదయం ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఉదయం 6:30 గంటలకు ఉదయం హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతి భాగ్యాన్ని వీక్షించవచ్చు.
అయోధ్య రాముడ్ని చూడాలనుకునే భక్తులు ముందుగానే పాస్ లు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో పొందవచ్చు. పాస్ లు పొందిన వారు హారతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా వ్యక్తుల గుర్తింపు నిర్ధారణ అవుతుంది.
లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్' సెక్షన్పై క్లి చేయాలి. హారతి లేదా దర్శనంలో కావాల్సిన స్లాట్ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాలన్నింటిని చెక్ చేసుకొని బుకింగ్ను పూర్తి చేసి పాస్ను పొందొచ్చు. ప్రవేశానికి ముందు ఆలయం కౌంటర్ వద్ద భక్తులు పాస్ను పొందొచ్చు. కాగా ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ ప్రస్తుతం హోల్డింగ్లో ఉంది. అధికారులు మరికొద్ది గంటల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక ఆఫ్లైన్ పాస్లు పొందాలనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి పాస్ను పొందొచ్చని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్సైట్ చెబుతోంది. అదే రోజున పాస్లను బుక్ చేసుకోవాలనుకునే వారి విషయంలో ‘తొలుత వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం’ సూత్రం ఆధారంగా పాస్లను అందజేస్తారు.
హారతికి 30 నిమిషాల ముందు ఆలయం వద్ద ఉండాలి. పాస్లపై క్యూఆర్ కోడ్ల ఆధారంగా సులభంగా భక్తులను అనుమతిస్తారని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్సైట్ పేర్కొంది.
ఇక ఆలయం వద్దకు చేరుకోవడానికి భక్తులకు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఆటో-రిక్షాలు, సైకిల్ రిక్షాలు ద్వారా సరయు నది ఒడ్డున ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. అయితే మంగళవారం భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉండటంతో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక టైమ్ స్లాట్ లేదా ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలని చూస్తోంది.