120 km journey on full charge... E-bikes at low price at Nampally exhibition
ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల జర్నీ... నాంపల్లి ఎగ్జిబిషన్లో తక్కువ ధరకే ఇ-బైక్స్
మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల ప్రయాణం చేయగల ఎలక్ట్రిక్ స్కూటర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఫుడ్ స్టాల్స్, బట్టల షాపులు మాత్రమే కాకుండా eBikes కూడా హైదరాబాద్ ప్రజల కోసం తెచ్చారు. ఎడిఎంఎస్ eBikes వారు తమ దగ్గర ఉన్న 14 నుంచి 18 ఈ బైక్స్ వెరైటీలు నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకురావడం వారికి సంతోషంగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ షాపు నుమాయిష్ చరిత్రలోనే భిన్నమైన షాప్. ఎందుకంటే ఇది డబుల్ డెక్కర్ షాప్. ఇందులో పైన ఉన్న అంతస్తులో కూడా భిన్నమైన బైక్స్ చూడొచ్చు.
ఈ బైక్స్ అన్నీ బ్యాటరీతో నడుస్తాయి. వీటికి పెట్రోల్ అవసరం ఉండదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా స్పోర్ట్స్ బైక్స్, నార్మల్ బైక్స్, వ్యవసాయానికి లేదా ఫుడ్ డెలివరీకి పనికి వచ్చే బైక్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనం మొదటిగా చూడొచ్చు. షార్క్ ఎలక్ట్రానిక్ బైక్ దీని ఫీచర్స్ ఏంటంటే మోటర్ కెపాసిటీ 2600 Watt, ఒక్క ఛార్జ్ లో 120 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ షాక్ బైక్ 120 కిలోమీటర్ల వేగంతో సులభంగా వెళుతుంది. ఈ షార్క్ బైక్ ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుతుంది. ఈ షార్క్ బైక్ ధర వచ్చేసి దాదాపు 2 లక్షల లోపే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఏడిఎంఎస్ డిబి అనే బైక్ వైట్ కలర్ లో ప్రతి ఒక్కరికి నచ్చేలా బాగా డిజైన్ చేశారు, ఈ బైకు స్కూటీ మోడల్ లో దొరుకుతుంది. దీని ధర వచ్చేసి కేవలం రూ.1,33,000 వేల రూపాయల వరకే ఉంటుందని చెబుతున్నారు.
ఈ బైక్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 2000 Watt, ఒక్కసారి ఛార్జ్ పెడితే చాలు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అని చెబుతున్నారు. అలాగే స్పోర్ట్స్ లగేజ్ బైక్స్ కాకుండా వికలాంగుల కోసం ఏడిఎంఎస్ జిటిఆర్ త్రిచక్ర వాహనం కూడా తయారు చేశారు. అయితే ఈ వాహనం బ్యాటరీతో నడుస్తుందని, వికలాంగులకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెప్తున్నారు.