MRI scanning

She go for MRI scanning.. the life itself is lost

 ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది.. ఈ జాగ్రత్తలు లేకనే!

She go for MRI scanning.. the life itself is lost

ఏలూరులో దారుణం జరిగింది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన మహిళ డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సదరు మహిళకు గతంలోనే పేస్ మేకర్ అమర్చారు. అయితే డయాగ్నోస్టిక్ సిబ్బంది మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేయకుండానే స్కానింగ్ నిర్వహించారు. దీంతో ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా పేస్ మేకర్ ఊడిపోయి మహిళ చనిపోయినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు డయాగ్నోస్టిక్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయిందని ఆరోపిస్తున్నారు.

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళ.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో బంధువులు డయాగ్నోస్టిక్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేటలో సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం ఏలూరు రూరల్ మండలం ప్రతికోళ్లంకకు చెందిన రామతులసమ్మ అనే మహిళ వచ్చింది. రామతులసమ్మ గత కొన్నిరోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.

అయితే ఎమ్ఆర్ఐ స్కాన్ తీయించుకోవాలని అక్కడి డాక్టర్ సూచించడంతో.. రామతులసమ్మ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం సుస్మిత డయాగ్నోస్టిక్ కేంద్రానికి వచ్చారు. కానీ.. డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రామతులసమ్మకు గతంలో పేస్ మేకర్ అమర్చారు. అయితే ఎమ్ఆర్ఐ స్కానింగ్ సమయంలో మెటల్ డిటెక్టర్ సాయంతో రామతులసమ్మను చెక్ చేయలేదు డయాగ్నోస్టిక్ సిబ్బంది. నేరుగా స్కానింగ్ మెషీన్‌లోకి పంపించారు. అయితే మెషీన్‌లోని వెళ్లిన వెంటనే ఎమ్ఆర్ఐ స్కాన్ రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ విలవిల్లాడిపోయారు. మెషీన్‌లోనే కొట్టుమిట్టాడుతూ కన్నుమూశారు.

ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా పేస్ మేకర్ ఊడిపోయి రామతులసమ్మ మరణించినట్లు తెలుస్తోంది. కానీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా రామతులసమ్మ చనిపోయినట్లు స్కానింగ్ సెంటర్ సిబ్బంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామతులసమ్మ భర్త కోటేశ్వరరావు డయాగ్నోస్టిక్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. స్కానింగ్ మెషీన్‌లో తన భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని గుర్తించి.. స్కానింగ్ ఆపాలని సిబ్బందిని కోరినట్లు ఆయన చెప్తున్నారు. కానీ డయాగ్నోస్టిక్ సిబ్బంది పట్టించుకోలేదని... చివరకు తన భార్య రేడియేషన్‌ తట్టుకోలేక చనిపోయిందంటూ ఆయన వాపోయారు. డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు.

సాధారణంగా ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన వారి శరీరంపై ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా సిబ్బంది జాగ్రత్త పడతారు. అలాగే శరీరంలో ఏవైనా మెటల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చారా అనే విషయాల గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకుంటారు. మెటల్ వస్తువులు ఉంటే ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఏలూరు ఘటనలో డయాగ్నోస్టిక్ సిబ్బంది మెటల్ డిటెక్టర్ సాయంతో తనిఖీ చేయకపోవటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. అలాగే సదరు మహిళ తన ఒంట్లో పేస్ మేకర్ అమర్చిన విషయం డయాగ్నోస్టిక్ సిబ్బందికి తెలిపారా లేదా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.