MTech

 MTech 

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేకుండానే ఎంటెక్‌లో ప్రవేశాలు

MTech
MTech | రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇం జినీరింగ్‌ (ఎంఈ, ఎంటెక్‌) కోర్సులకు ప్రవేశ పరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నా యి. ఈ నేపథ్యంలో6 పోస్ట్‌ గ్రాడ్యుయే ట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (పీజీఈ సెట్‌)లో కొన్ని పరీక్షలు రద్దు కా నున్నాయి. వీటిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. 

MTech | ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేకుండానే ఎంటెక్‌లో ప్రవేశాలు
MTech | హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇం జినీరింగ్‌ (ఎంఈ, ఎంటెక్‌) కోర్సులకు ప్రవేశ పరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నా యి. ఈ నేపథ్యంలో6 పోస్ట్‌ గ్రాడ్యుయే ట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (పీజీఈ సెట్‌)లో కొన్ని పరీక్షలు రద్దు కా నున్నాయి. వీటిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల్లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, పీజీఈసెట్‌ పూర్వ కన్వీనర్‌ రవీంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫారసులు చేయనుండగా, వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలకు ఆమోదిస్తే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024 -25 సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్‌ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తుండగా, పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువుండటం ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతోనే ఈ దిశగా అడుగులేస్తున్నారు.

ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ యేడులో 27 కాలేజీల్లో 718 ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లుంటే నలుగురు విద్యార్థులు అర్హత సాధిస్తే వారిలో ఒక్కరు కూడా చేరలేదు.
టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో 18 సీట్లుంటే 8మంది పీజీఈసెట్‌లో అర్హత సాధించగా, ఒక్కరూ చేరలేదు.
మెటలర్జీకి ఒక కాలేజీలో 30 సీట్లుం టే ఐదుగురే అడ్మిషన్స్‌ పొందారు.
కెమికల్‌ ఇంజినీరింగ్‌లో 138 సీట్లుంటే 20 సీట్లే భర్తీ అయ్యాయి.
సీఎస్‌ఈ, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సులకు డిమాండ్‌ తీవ్రంగా ఉండగా, వీటికి ప్రవేశ పరీక్షను నిర్వహించి, సీట్లను భర్తీచేస్తారు.

పీఈసెట్‌కు రాత పరీక్ష..
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌ పరీక్షా విధానం మార్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈవెంట్స్‌కు బదులుగా రాత పరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించారు. ఈ కమిటీలో పాలమూరు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, ప్రొఫెసర్‌ సత్యనారాయణ, ప్రొఫెసర్‌ సత్యనారాయణ, ప్రొఫెసర్‌ రాజేశ్‌లు సభ్యులుగా ఉన్నారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.